KNR: ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్ (1, 3 యూనిట్లు) ఆధ్వర్యంలో కొక్కెరకుంట, వన్నారం గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక సేవా శిబిరాలు గురువారం మూడో రోజుకు చేరుకున్నాయి. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బీ. సంజీవ్ వాలంటీర్లతో కలిసి గ్రామాల్లో మొక్కలు నాటి, విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు.