MULG: ఆర్టీసీ వరంగల్-2 డిపో ఆధ్వర్యంలో జిల్లాలో ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం గురువారం నిర్వహించారు. వివిధ మండలాల నుంచి 10 మంది డీఎం రవిచందర్కు ఫిర్యాదులు అందజేశారు. హనుమకొండ–ములుగు సాయంత్రం ఎక్స్ప్రెస్ సర్వీసులు పెంచాలని, మేడారం–ఏటూరునాగారం కనెక్టివిటీ మెరుగుపరచాలని కోరారు. లక్నవరం క్రాస్, జంగాలపల్లి అంగడి వద్ద బస్సులు ఆపాలని విజ్ఞప్తి చేశారు.