JN: మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో బస్సుల కొరతతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరంగా మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. గ్రామాలకు సరైన సమయానికి బస్సులు రాకపోవడం, పలు కీలక రూట్లను నిలిపివేయడం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.