SKLM: ఆమదాలవలసలోని మున్సిపల్ కాంప్లెక్స్లోని విశాఖ డెయిరీలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. షాప్ తాళాలు పగలగొట్టి రూ.15 వేల వరకు దొంగలించినట్లు బాధితులు ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై బాలరాజు ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పట్టణంలో వ్యాపారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.