AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెట్రోల్ బంకులు బంద్ అయ్యాయి. దీంతో కొరత ఏర్పడుతుందనే భయంతో వాహనదారులు బంకుల వద్ద బారులు తీరారు. ముఖ్యంగా తిరువూరు, గుంటూరు, గుడివాడలో వాహనాల ట్యాంకులు ఫుల్ చేయించుకునేందుకు జనం ఎగబడ్డారు. దీంతో సాధారణం కంటే అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయని బంకు యజమానులు చెబుతున్నారు. కొన్నిచోట్ల ఇప్పటికే ‘NO STOCK’ బోర్డులు కనిపిస్తున్నాయి.