TG: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.927 కోట్లు చెల్లించామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.1,480 కోట్లు చెల్లించామని స్పష్టం చేశారు. గతంలో CMRF చెక్కుల విషయంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. తాము రూ.2,046 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేశామన్నారు. ఎవరి PAలు CMRF కాజేశారో కూడా తెలుసన్నారు. విచారణ జరుగుతోందని, అన్నీ బయటకు వస్తాయని పేర్కొన్నారు.