»A Woman Ao Who Stabbed An Aeo In Yadadri Bhuvanagiri District
Yadadri Collectorate: ఏఈవోను కత్తితో పొడిచిన మహిళా ఏవో
ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే అయినా విచక్షణ మరిచిపోయారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత కారణాలు వలన ముందు గొడవ పడ్డారు, తరువాత మహిళపై కత్తితో దాడిచేయబోయాడు, తప్పించుకున్న మహిళ అదే కత్తితో ఏఈవోను పొడిచింది.
A woman AO who stabbed an AEO in Yadadri Bhuvanagiri district
Yadadri Collectorate: యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లా పరిధిలో కత్తిపోట్ల కలకలం సంచలనం రేకెత్తించింది. వ్యవసాయ శాఖలో పని చేసే ఏవో, ఏఈవోలు మధ్య జరిగిన గొడవ కత్తితో దాడి చేసుకునే పరిస్థితికి దారి తీసింది. ఏఈఓగా పనిచేస్తున్నా మనోజ్ గత మూడు నెలల క్రితం వరకు యాదగిరిగుట్ట వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏఈవో గా పనిచేస్తున్నాడు. మూడు నెలల నుంచి ఆయన లీవ్ పెట్టి వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో మనోజ్ శుక్రవారం కలెక్టరేట్ లోని జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం వచ్చాడు. ఇదే క్రమంలో ఆత్మకూరు మండల వ్యవసాయ శాఖ ఏవోగా పని చేస్తున్న శిల్ప అక్కడే ఉంది. ఇద్దరి మధ్య మాటమాట పెరిగి ఘర్షణ అయింది. కోపంతో మనోజ్ కత్తి(knife)తో దాడి చేయబోయాడు. వెంటనే అప్రమత్తం అయిన శిల్ప దాడిని అడ్డుకొని అదే కత్తి తో మనోజ్పై దాడి చేసింది. మనోజ్ వీపుపై, మెడపై గాయాలు అయ్యాయి. వెంటనే భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. శిల్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శిల్పకు 2012లో వివాహం జరిగింది తనకు ఒక బాబు ఉన్నాడు. అయితే గత రెండు సంవత్సరాలుగా భర్తకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో మనోజ్తో పరిచయం అవడం ఇద్దరు రిలేషన్ షిప్లో ఉన్నట్లు సమాచారం. వ్యక్తిగతమైన కారణాలతోటే ఇరువురు గొడవ పడ్డట్లు తెలుస్తుంది.