VSP: మాదవధారలో జీవీఎంసీ బృందం సింగల్ యూజ్ ప్లాస్టిక్ తనిఖీలు చేపట్టింది. 16 షాపుల్లో తనిఖీ చేసి కేజీ ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వర్తకులకు రూ.3000 జరిమానా విధించారు. ఇదే విధంగా తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జోన్ శానిటేషన్ సూపర్వైజర్ రామారావు హెచ్చరించారు.