RR: నిరంతర వర్షాల కారణంగా బాచుపల్లి-మియాపూర్ రూట్లోని హెచ్డీఎఫ్సీ పాయింట్ వద్ద నీరు నిలిచిపోవడంతో వాహనాలు స్లోగా కదులుతున్నాయి. ప్రస్తుతం హైడ్రా (HYDRA) బృందం, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు క్షేత్రస్థాయిలో నీటిని తొలగిస్తూ, ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రయాణికులు అప్రమత్తంగా వాహనాలు నడపాలని అధికారులు సూచించారు.