NGKL: కల్వకుర్తి పట్టణానికి చెందిన స్వామి వివేకానంద సేవ బృందం, మై భారత ఆధ్వర్యంలో షాహిద్ దివాస్ సందర్భంగా సోమవారం ఉదయం పట్టణంలోని బస్టాండ్ ఆవరణంలో శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణంలో ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు, చెత్తను స్వచ్ఛందంగా తొలగించారు. అనంతరం దేశభక్తిని చాటుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.