NLG: యూరియా కొరతపై సీపీఎం నల్గొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ఆందోళన వ్యక్తం చేశారు. పంటలు పొట్టదశలో ఉన్న తరుణంలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని, సాంకేతిక అవగాహన లేక యాప్ ద్వారా కొనుగోలు చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందికరంగా పరిణమించిన యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.