TG: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో దైవదర్శనానికి వెళ్లిన రెండేళ్ల దళిత చిన్నారి అనుమానాస్పద మృతిపై సీపీఎం తెలంగాణ కార్యదర్శి జాన్ వెస్లీ స్పందించారు. చిన్నారి మృతి అత్యంత విషాదకరమని… చిన్నారి మృతిపట్ల సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపం తెలియజేస్తోందన్నారు. CM రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి చర్యలు తీసుకుని.. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.