RR: కందుకూరు చౌరస్తాలో ప్రతీ ఆదివారం జరిగే తైబజార్కు 2026-27 సంవత్సరానికి సంబంధించి ఈ నెల 26న వేలం నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి సురేందర్ గౌడ్ తెలిపారు. సర్పంచ్ సరికొండ పాండు అధ్యక్షతన గురువారం ఉ.10:30 గంటలకు వేలం పాట నిర్వహించనున్నామన్నారు. ఆసక్తి గలవారు ముందుగా రూ.10 వేలు దరావత్ చెల్లించి తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు.