MDCL: రామంతాపూర్ భగాయత్ వెంకట సాయి నగర్ కాలనీలో కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ వద్ద రాత్రి చీకటి కారణంగా మహిళల భద్రత సమస్యలు తలెత్తుతున్నాయి. ఈమేరకు అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతి పత్రం అందజేశారు. హైమాస్ట్ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని కోరగా, సమస్యను త్వరలో పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.