TG: రూ. 6వేల కోట్ల అంచనాతో మొదలుపెట్టిన దేవాదుల ఇవాళ రూ.18 వేల కోట్లు అవసరమైన స్థితికి చేరుకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని ప్రాజెక్టులపై సమగ్ర సమీక్ష చేసి అన్నింటినీ పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. కాళేశ్వరం కింద నీరు ఎత్తిపోయనప్పటికీ రాష్ట్రంలోనే అత్యధికంగా వరి దిగుబడి వస్తోందన్నారు.