VZM: బొండపల్లి మండలం దేవుపల్లిలో శనివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మక ‘ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్’ ఏర్పాటుతో జిల్లా దశ మారుతుందన్నారు. దీంతో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు అందుతాయని పేర్కొన్నారు. ఈనెల 23న ప్లాంట్కు శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు.