JGL: గొల్లపల్లి మండల ఎస్సీ,ఎస్టీ, బీసీ జేఏసీ కమిటీలను ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు మనాల కిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడిగా తాడురీ శ్రీనివాస్ చారి, ఉపాధ్యక్షుడిగా ఏనుగందుల తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా బాలే అశోక్ ఎన్నికయ్యారు. బహుజనుల హక్కుల సాధన కోసం ఈ కమిటీలు కృషి చేస్తాయని నాయకులు పేర్కొన్నారు.