KKD: పిఠాపురంలో తహసీల్దార్ గోపాలకృష్ణ ఫాస్ట్ ఫుడ్, మిఠాయి దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. దుకాణాల్లో నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు కమర్షియల్గా వినియోగిస్తున్న 4 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో దుకాణ యజమానులపై కేసులు నమోదు చేశారు. వాణిజ్య అవసరాలకు ఇంటి సిలిండర్లను వాడడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.