ATP: నార్పల(మం) బీ. పప్పూరు గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే బండారు శ్రావణి శనివారం తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రూ.42 లక్షలతో 56 మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతోందని ఆమె తెలిపారు. శానిటేషన్ విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.