VZM: రంజాన్ పండుగ పురస్కరించుకుని ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ పవిత్ర రంజాన్ అందరి జీవితాల్లో శాంతి, సౌభ్రాతృత్వం, సహనం, దయా గుణాలు మరింత పెంపొందించేలా ఉండాలని, సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం మరింత బలపడాలని ఆకాంక్షించారు.