SKLM: రంజాన్ పండగ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో శనివారం జరగాల్సిన పదో తరగతి పరీక్షను వాయిదా వేస్తున్నట్లు జిల్లా డీఈవో పి. రవిబాబు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఇవాళ జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేశారు. ఉపాధ్యాయులు మారిన తేదీల్లో యథావిధిగా విధులకు హాజరుకావాలని ఆయన స్పష్టం చేశారు.