TG: భద్రాద్రి జిల్లా కొల్లుగూడెం వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతైన ఐదుగురి గాలింపు ముగిసింది. నిన్న మూడు మృతదేహాలు లభ్యం కాగా, తాజాగా పాశం సతీష్, గోక తేజ మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికితీశారు. దీంతో ఈ విషాద ఘటనలో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాల లభ్యతతో ఆయా కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది. అధికారులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.