కర్నూలు జిల్లాలో రంజాన్ పండుగ సందర్భంగా శనివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. దర్గా, మసీదులు, ఈద్గాల వద్ద డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టి కీలక ప్రాంతాల్లో నిఘా పెంచినట్లు అధికారులు తెలిపారు.