NDL: బనగానపల్లె మండలంలోని మిట్టపల్లిలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం పర్యటించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రాథమిక పాఠశాల, కాపులపల్లెలో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు మొత్తం రూ.65.50 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తులసిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.