తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ ఉగాది ఆస్థానం కార్యక్రమం నిర్వహించనున్నారు. బంగారు వాకిలి చెంతకు సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి రానున్నారు. మరో పల్లకిపై శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడు విష్వక్సేనుల వేంచేపు, ఉత్సవమూర్తులకు నివేదనలు, పూజల తర్వాత నూతన వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేయనున్నారు.