PDPL: ఎలిగేడు మండల కేంద్రంలోని రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ అధికారులు ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు ఎరువుల యాప్ వాడకం, సేంద్రియ వ్యవసాయం, డ్రోన్ వాడకంపై అవగాహన కల్పించారు. రైతులకు సాయి హెల్త్ కార్డులు, సేంద్రియ వ్యవసాయ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమలో MAO ఉమాపతి, AEO సురేష్, రైతులు పాల్గొన్నారు.