JGL: మల్యాల మండలంలోని ఎంఆర్వో కార్యాలయంలో మండల ఎంఆర్వోకు బీజేపీ కార్యకర్తలు వినతి పత్రం సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ఉచిత బస్ పథకం మినహా ఇతర హామీలు అమలు కాలేదని, రైతుభరోసా, రూ. 500 గ్యాస్ సిలిండర్, తులం బంగారం వంటి హామీలు నెరవేరలేదని పేర్కొన్నారు.