MLG: మేడారం మహాజాతరలో జంపన్నవాగు సూర్యాస్తమయ సమయంలో అద్భుత దృశ్యాన్ని సృష్టించింది. సూర్యకిరణాలు వాగు పై పడటంతో నీరు పూర్తిగా ఎరుపు రంగులో మారింది. చారిత్రక కథనాల ప్రకారం సమ్మక్క కుమారుడు జంపన్న వీరమరణం పొందిన సమయంలో వాగు ఎర్రబడినట్లు చెబుతారు. ఇప్పుడు వాగు నిండుకుండలా ఎరుపురంగులో వెలిగిపోతుండటంతో భక్తులు భక్తిపారవశ్యంతో పులకించిపోతున్నారు.