CTR: చౌడేపల్లి మండలం కాగతి ప్రాథమికోన్నత పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాలలోకి వచ్చి ముగ్గు వేసి, నిమ్మకాయలు కోసి, అక్షింతలు వేసి తాంత్రిక పూజలు చేసి ఉండగా మంగళవారం ఉదయం గుర్తించారు. దీనిని చూసిన ఉపాధ్యాయులు, పిల్లలు భయాందోళనకు గురయ్యారు. గతంలో పలుమార్లు ఇలా జరిగిందని వారు తెలిపారు.