KRNL: లంబాడీల సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ లంబాడీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఆర్.కైలాష్ నాయక్ సోమవారం ఢిల్లీలో నేషనల్ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ అంతర్సింగ్ ఆర్యా, జాతీయ సభ్యుడు జాటోత్ హుసేన్ నాయక్లను కలిశారు. రాష్ట్రంలోని లంబాడీల ప్రస్తుత స్థితిగతులు, వారి హక్కుల పరిరక్షణపై వినతిపత్రం సమర్పించారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.