హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ ప్రధాన రహదారిపై నేడు జాతీయ భద్రత మాస ఉత్సవాలను కార్పోరేటర్ తొట్ల రాజు యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రహదారి నిబంధనలు పాటించినప్పుడే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరారు. స్థానిక సీఐ పుల్యాల కిషన్, రాజకుమార్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.