ASR: కొయ్యూరు మండలంలోని బూదరాళ్ల పంచాయతీ పరిధిలోని సాకులపాలెం, నూకరాయితోట గ్రామాల్లో సోమవారం మంప ఎస్సై శ్రీనివాస్ పర్యటించారు. ఆయా గ్రామాల ప్రజలతో సమావేశం నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం రహదారి నిబంధనలు, గంజాయి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.