NDL: APSSDC ఆధ్వర్యంలో ఇవాళ డోన్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 13 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు.