KDP: జనసేన పార్టీ నాయకుడు అతికారి వెంకటయ్య నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈయన మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘వెంకటయ్య మృతి చెందారని తెలిసి చింతిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. రాజంపేట నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను క్రియాశీలకంగా నిర్వహించారు’ అని అన్నారు.