PDPL: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని ప్రమాదాలు నివారించాలని పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ కోరారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆలైవ్, అరైవ్, పది రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా మంథని పోలీసుల ఆధ్వర్యంలో రహదారి భద్రత ట్రాఫిక్ నియమాలపై ప్రధాన రహదారిపై అవగాహన సదస్సు నిర్వహించారు.