GNTR: రైలుపేటలో ఇంటి పనికి వచ్చి యజమాని నగలు చోరీ చేసిన మంగమ్మ అనే మహిళను కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు లక్ష్మీకుమారి తీర్థయాత్రలకు వెళ్తూ ఇంటి తాళాలు ఇవ్వగా, శుభ్రం చేసే నెపంతో మంగమ్మ బంగారాన్ని తస్కరించింది. పోలీసులు నిందితురాలిని గుర్తించి, దొంగిలించిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ సోమవారం తెలిపారు.