తిరుపతిలో జూ పార్క్ రోడ్లోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. వెస్ట్ పోలీసుల కథనం ప్రకారం.. సుమారు 30 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి జూ పార్క్ అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు వద్ద ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.