WG: తణుకు రహదారిలోని గవర్లపాలెం వద్ద గల రైల్వే గేటును ట్రాక్ మరమ్మతుల కారణంగా ఇవాళ ఉదయం 7 గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు మూసివేస్తున్నట్లు ద.మ. రైల్వే సోమవారం ప్రకటించింది. ఇందుకోసం సూచిక బోర్డును గేటు వద్ద అధికారులు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కోరారు.