GDWL: నడిగడ్డ ఆరాధ్య దైవం జమ్ములమ్మ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు అని గద్వాల రూరల్ ఎస్సై శ్రీకాంత్ పేర్కొన్నారు. సోమవారం జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ పరశురామ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన ఆయన, జాతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ నెల 27న అమ్మవారు గుర్రంగలకు వెళ్లే ప్రధాన ఘట్టంను పరిసిలించారు.