PPM: రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన శంబర పోలమాంబ అమ్మవారి జాతర ఈ నెల 26 నుంచి 28 వరకు జరుగనుంది. ఈ నేపథ్యంలో జిల్లా అదనపు ఎస్పీ వీ.మనీషా రెడ్డి సోమవారం ఆ ప్రాంతంలో పర్యటించి జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె జాతర ఏర్పాట్లు పటిష్ఠంగా చేయాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు, పోలీసు సిబ్బందికి ఆదేశించారు.