KDP: కమలాపురం మండలం కొప్పర్తికి గ్రామానికి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్, జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవిత మంగళవారం రానున్నట్లు టీడీపీ కార్యాలయం తెలిపింది. కొప్పర్తిలో ఆధ్యాత్మిక సమ్మేళనం (ఇస్తేమా) నిర్వహిస్తున్న నేపథ్యంలో మంత్రులు వస్తున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు.