SKLM: పాతపట్నం మండలం ఎ.ఎస్. కవిటి గ్రామం, చీకటి తోటలో జూదం ఆడుతున్న ఒడిశా పర్లాఖెముండికి చెందిన 9 మంది వ్యక్తులను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె. మధుసూధనరావు సోమవారం తెలిపారు. వారి నుంచి రూ. 29,700 నగదు, 7 సెల్ ఫోన్స్ లు , 6 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.