KMR: మహిళల ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం వడ్డీలేని రుణాలు అందిస్తోందని ఎల్లారెడ్డి ఆర్డీఓ పార్థ సింహారెడ్డి తెలిపారు. స్థానిక ముత్యపు రాఘవులు పెంటయ్య పంక్షన్ హాల్లో మెప్మా ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల చెక్కులు, మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.