ADB: ఉట్నూర్లోని ఐటీడీఏ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు అంబాజీ ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఏజెన్సీ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలతో వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందించారు. దీంతో గిరిజనులు తెలిపిన సమస్యలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని పరిష్కరించాలని డీడీ ఆదేశించారు.