కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ నవీన్తో కలిసి కలెక్టర్ బాలాజీ సోమవారం ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి అర్జీల రూపంలో వచ్చిన సమస్యలను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.