కోనసీమ: అంతిర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన సమీక్ష లో కలెక్టర్ మాట్లాడుతూ భద్రత, పార్కింగ్, ఆర్టీసీ బస్సులపై దిశా నిర్దేశం చేశారు. సీసీ టీవీ నిఘాతో పాటు డ్రోన్లతో పగడ్బందీ భద్రత చర్యలు ఏర్పాటు చేయాలన్నారు.