SRPT: మంత్రి ఉత్తమ్ రేపు హుజూర్నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గడ్డిపల్లిలో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్’ పనులను పరిశీలించి, అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తారు. మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నాక, మున్సిపల్ ఎన్నికలపై పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహించనున్నారు.