BHPL: జిల్లా కేంద్రంలోని రామయ్యపల్లి గ్రామంలో ఇవాళ సాయంత్రం రూ.10 లక్షల వ్యాయామంతో నిర్మించనున్న లక్ష్మీ దేవర దేవాలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, DCC జిల్లా అధ్యక్షుడు కరుణాకర్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.