BHPL: జిల్లా కేంద్రంలోని భరత్ ఫంక్షన్ హాల్లో జిల్లా స్థాయి చెస్ పోటీలు ఇవాళ రసవత్తరంగా ముగిసాయి. నిన్న అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై ఈ టోర్నమెంట్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్లో విశ్వజిత్ సాయి 1వ స్థానం (రూ.10,000), అభిషేక్ 2వ స్థానం (రూ.5,000), మధుశ్రీ 3వ స్థానం (రూ.3,000) సాధించినట్లు చెస్ అసోసియేషన్ తెలిపింది.