KMM: ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్ అన్నారు. ఇవాళ ఖమ్మం రూరల్ సీపీఎం కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కొంతమంది తమ స్వార్థ రాజకీయాల కోసం మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, దీంతో అధిక పన్నులు కట్టలేక పేదలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.