ప్రకాశం: తాళ్లూరుకు చెందిన పలువురికి దర్శి టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఇడమకంటి వరలక్ష్మికి రూ. 80వేలు, కోట కోటేశ్వరమ్మకు రూ. 35 వేలు విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరు మండల అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.